పాక్కు భారత్ భారీ షాక్! గగనతల తాళం వేసిన మోడీ సర్కారు!
Thu May 01, 2025 07:26 India
జమ్మూకాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న విషయం తెలిసిందే. 26 మంది భారతీయుల ప్రాణాలు బలిగొన్న ఈ ఉగ్రదాడిలో పాక్ ప్రమేయం ఉండటంతో ఆ దేశంపై అన్ని రకాలుగా కఠిన చర్యలకు దిగింది భారత్. తాజాగా, పాకిస్థాన్కు మరో భారీ షాకిచ్చింది మోడీ సర్కారు.
పాకిస్థాన్ గగన తలంపై మనదేశ విమానాల రాకపోకలపై ఆ దేశం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ కూడా ధీటుగా స్పందించింది. పాక్ విమానయాన సంస్థలకు మన దేశ గగన తలాన్ని (Indian airspace) మూసివేసింది. ఇందుకు సంబంధించిన నోటమ్ (NOTAM) ను తాజాగా బుధవారం జారీ చేసింది. ఈ నిర్ణయంం ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు అమలులో ఉండనుంది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఏ క్షణమైనా భారత్ తమ దేశంపై దాడి చేసే అవకాశం ఉండొచ్చనే భావనతో ఇటీవల పాక్ మన విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత్ కూడా పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధూ నదీ జలాల ఒప్పందం అమలు నిలిపివేత, అటారీ-వాఘా సరిహద్దు మూసివేతతోపాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ వదిలి వెళ్లాలని ఆదేశించింది.
తాజాగా, పాక్ దేశ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా అధికారికంగా నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్థాన్ కు సంబంధించిన కమర్షియల్, లీజుకు తీసుకున్న, సైనిక విమానాలు భారత గగన తలాన్నిఉపయోగించుకోలేవు. ఈ నిర్ణయంతో పాక్ విమానాలకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. కౌలాలంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయ్లాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు చైనా, శ్రీలంక గుండా దూర ప్రయాణం చేయాల్సిందే. దీంతో పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ సంస్థల విమానాలు ఎక్కువ దూరంగా ప్రయాణించడంతోటు ఎక్కువ సమయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఏపీలో పెన్షనర్లకు షాక్..! జాబితా నుంచి వారి పెర్లు తొలగింపు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..
అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ చిన్న పని తో..
కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!
6 లైన్లుగా రహదారి, డీపీఆర్పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..
సీఐడీ కస్టడీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..
మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?
ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!
గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #IndiaStrikesBack #AirspaceBan #ModiGovernment #PakistanTension #PahalgamAttack
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.